మీ సేవ కేంద్రాల పై చర్యలు తీసుకోండి.. ఎమ్మార్వోకు వినతి..

by Sumithra |
మీ సేవ కేంద్రాల పై చర్యలు తీసుకోండి.. ఎమ్మార్వోకు వినతి..
X

దిశ, మల్యాల : అధిక చార్జీలు వసూలు చేస్తున్న మీసేవ కేంద్రాల పై చర్యలు తీసుకోవాలని సోమవారం మల్యాల తహశీల్దార్ మునీందర్ కు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సతీష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. మండలంలోని మీసేవ కేంద్రాల నిర్వహకులు ప్రజల వద్ద ఇష్టం వచ్చిన రీతిలో అధిక చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. మీసేవ కేంద్రాలలో ధరల పట్టికను ఏర్పాటు చేసి, అధిక చార్జీలను వసూలు చేసే కేంద్రాల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఎల్లప్పుడు మీ సేవ కేంద్రాల పై అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed