నిర్ణీత గడువులోగా ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. కలెక్టర్

by Sumithra |
నిర్ణీత గడువులోగా ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. కలెక్టర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని పేర్కొన్నారు.

కాగా మొత్తం 149 దరఖాస్తులు రాగా, రెవెన్యూ శాఖకు 76, సిరిసిల్ల మున్సిపల్ కు 18, విద్యా శాఖకు, జిల్లా వైద్యాధికారి, ఎస్డీసీ, డీఆర్డీఓకు 6, జిల్లా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖకు 4, ఉపాధి కల్పన శాఖకు 3 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్, ఎంపీడీవో తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట, సెస్ శాఖకు రెండు చొప్పున, ఏడీ సర్వే, మైన్స్, అటవీశాఖ, ఎల్ డీఎం, డీఎస్సీడీఓ, దేవాదాయ శాఖ ఒకటి చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed