- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఫేక్ ఐడీతో లోన్.. ఖంగు తిన్న రైతు..
by Sumithra |
X
దిశ, జగిత్యాల టౌన్ : క్రాప్ లోన్ తీసుకుందామని వెళ్లిన ఓ రైతుకు బ్యాంక్ అధికారులు షాకిచ్చారు. ఆ రైతు పేరు పై ఇదివరకే 20 లక్షల లోన్ ఉందని చెప్పడంతో రైతు కంగుతిన్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకోగా న్యాయం చేయాలంటూ బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. బుగ్గారం మండలంలోని మద్దునూరు గ్రామానికి చెందిన ముంజాల నారాయణ పేరు పై ఫేక్ ఐడీతో మరొకరు లోన్ తీసుకున్నారు. ఆధార్ లో ఫోటో మార్చి ఫేక్ ఐడీతో లోన్ తీసుకున్నట్లుగా బాధితుడు ఆరోపించాడు. న్యాయం చేయాలంటూ ప్రజావాణి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపగా ఈ ఫేక్ ఐడిలోన్ వ్యవహారంలో ఒక్కరే బాధితులా లేక మరికొందరు ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story