- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘మీ కుటుంబాలు నాశనమైపోతాయి’.. తెలుగు మీడియాపై KA పాల్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 నెలలు కష్టపడి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపితే.. తెలుగు మీడియా తనకు క్రెడిట్ ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పోయేలా వాదించి 10 సార్లు ఆపానని, ఎవరు అమ్మారు..? ఎంతకు అమ్మారు..? ఎందుకు అమ్మారు..? ఎవరు కొంటున్నారు..? అని రుజువులతో నేను తప్ప ఎవరన్నా వాదించారా..? అని కేఏ పాల్ ప్రశ్నించారు. జేడీ లక్ష్మీనారాయణ మూడు నెలల్లో కనీసం ఒక్క రోజైన కోర్టుకు వచ్చాడా..? అని మండిపడ్డారు.
అలాంటిది ఆయనకు క్రెడిట్ ఇవ్వడానికో, ఇంకోవరికో క్రెడిట్ ఇవ్వడానికో చూస్తే దేవుడు మిమ్మల్ని శపించడా..? అని కోపంతో ఊగిపోయారు. సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురించడం సరైనదేనా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్ముకుండా చేసిన ఏకైన వ్యక్తిని నేనే అంటూ చెప్పుకొచ్చారు. అలాంటిది ఇంకెవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవుతాయని కేఏ పాల్ తెలుగు మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.