Breaking: ఆంధ్రాలో అభివృద్ధి సున్నా.. అవినీతిలో నెంబర్‌వన్: సీఎం జగన్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
Breaking: ఆంధ్రాలో అభివృద్ధి సున్నా.. అవినీతిలో నెంబర్‌వన్: సీఎం జగన్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించబోతోందని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13న ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని అన్నారు. దేశంలో ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాలే విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మరికొద్ది రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని తెలిపారు. ఆంధ్రాలో తమకు పోటీగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. ఫలితాలు వెలువడక ముందే కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగికరించిందని ఎద్దేవా చేశారు.

మరోవైపు వైసీపీకి ఐదేళ్లు అధికారం ఇచ్చినా.. రాష్ట్రానికి ఏమి చేయలేదని, ఆ పార్టీ పూర్తిగా ప్రజాగ్రహానికి గురైందని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో రాష్ట్రం అభివృద్ధిలో కూడా వెనకబడిందని ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు అధికారంలో ఉన్న నాడు రాష్ట్రం అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తిందని, వైసీపీని అధికారంలోకి రాగానే పట్టాలు తప్పిందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని యువతలో అద్భుతమైన టాలెంట్ ఉందని, టెక్నాలజీకి సంబంధించి ప్రపంచ దేశాలకు ఆంధ్ర పేరు సుపరిచితమని మోడీ అన్నారు. ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో సున్నా.. అవినీతిలో నెంబర్‌వన్ అయిందని మోడీ అన్నారు.

Next Story

Most Viewed