కాంగ్రెస్ ను ఆశీర్వదించి.. వంశీ చందర్ రెడ్డి ని గెలిపించండి : మక్తల్ ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ ను ఆశీర్వదించి.. వంశీ చందర్ రెడ్డి ని గెలిపించండి : మక్తల్ ఎమ్మెల్యే
X

దిశ, ఊట్కూర్ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి.. చల్లా వంశీచందర్ రెడ్డిని గెలిపించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఊట్కూర్ మండలం నాగిరెడ్డి పల్లి, మల్లేపల్లి, కొల్లుర్, సమిస్తాపూర్ గ్రామాల్లో హర్ ఘావ్ - ఏక్ గంటే కార్యక్రమంలో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కోరారు. అయ గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామ సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాలకు సంబంధించి తమ గ్రామాలకు ప్రధాన రహదారులు సైతం మట్టి రోడ్లు ఉండటంతో తీవ్ర పాట్లు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.

ఎక్కడైనా త్రాగునీరు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యే శ్రీహరి అడిగి తెలుసుకున్నారు. అయ గ్రామాలలో నెలకొన్న సమస్యలపై తప్పకుండా పరిష్కార మార్గం తప్పకుండా చూపిస్తానన్నారు. ఎమ్మెల్యేగా తనను గ్రామస్థులు అందరూ కష్టపడి పని చేసి గెలిపించారని అందుకు రుణపడి ఉంటానని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి చల్లా వంశీ చందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలకృష్ణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సూర్య ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యగ్నేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed