CM Yogi: పీవోకేపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. మరో ఆరు నెలల్లో ఆ పని చేస్తామని కామెంట్స్

by Shiva |
CM Yogi: పీవోకేపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. మరో ఆరు నెలల్లో ఆ పని చేస్తామని కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మరో ఆరు నెలల్లో పీవోకే భారత్ వశం అవుతోందని ఎన్నికల వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాసిక్ జిల్లాలోని పాల్ఘర్, మాలేగావ్‌లలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అట్టడుగు స్థాయికి దిగజారిందిని.. ఈ సమయంలో పీవోకేను కాపాడుకోవడం చాలా కష్టం కూడుకున్న పని అని అన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపిస్తే.. మరో ఆరు నెలల్లో పీఓకే భారత్‌ వశం అవుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పని చేయాలంటే కేవలం దమ్మున్న ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed