- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇండ్ల స్థలాల గురించి ఆలోచించండి.. CM రేవంత్కు జర్నలిస్టుల రిక్వెస్ట్

దిశ, వెబ్డెస్క్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.బసవపున్నయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం అసెంబ్లీలో సీఎంను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఇండ్ల స్థలాలు, ఆరోగ్య బీమా పథకం, అక్రెడిటేషన్ కార్డులు, పెన్షన్ పథకం, మహిళా జర్నలిస్టులకు రాత్రి సమయంలో రవాణా సౌకర్యం, అర్హత ఉన్న చిన్న, మధ్యతరహా పత్రికలకు ఎన్ ప్యానల్ మెంట్, తదితర సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరారు. టీడబ్లూజేఎఫ్ వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ.రాజశేఖర్, గుడిగ రఘు, హెచ్యూజే అధ్యక్షులు బీ.అరుణ్ కుమార్, నాయకులు క్రాంతి, సీనియర్ జర్నలిస్టులు జాన్ రాస్, రాజేష్ జైన్, గంగాధర్, పూర్ణ చంద్ర రావు, బస్వ రాజ్ తదితరులు ఉన్నారు.