KTR ఆదేశాలు బేఖాతరు.. స్పీకర్‌కు ఫిర్యాదు వేళ ఆ ఎమ్మెల్యేలు డుమ్మా

by Rajesh |   ( Updated:2024-07-16 07:18:02.0  )
KTR ఆదేశాలు బేఖాతరు.. స్పీకర్‌కు ఫిర్యాదు వేళ ఆ ఎమ్మెల్యేలు డుమ్మా
X

దిశ, వెబ్‌డెస్క్: నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌కు మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు. కాగా, ఎమ్మెల్యేలు అందరు హజరు కావాలని ఆదేశాలు ఉన్నా కొంత మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్‌లో మరి కొంత ఎమ్మెల్యేలు చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఎమ్మెల్యేల గైర్హాజరు తీవ్ర ఉత్కంఠగా మారింది.

హాజరు కాని ఎమ్మెల్యే లు వీరే..!

సుధీర్ రెడ్డి - ఎల్బీనగర్ ఎమ్మెల్యే

బండారు లక్ష్మారెడ్డి - ఉప్పల్ ఎమ్మెల్యే

మల్లారెడ్డి - మేడ్చల్ ఎమ్మెల్యే

కొత్త ప్రభాకర్ రెడ్డి - దుబ్బాక ఎమ్మెల్యే

తలసాని శ్రీనివాస్ యాదవ్ - సనత్ నగర్ ఎమ్మెల్యే

జగదీష్ రెడ్డి - సూర్యాపేట ఎమ్మెల్యే

గంగుల కమలాకర్ - కరీంనగర్ ఎమ్మెల్యే

కోవ లక్ష్మీ - ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

అనిల్ జాదవ్ - బోథ్ ఎమ్మెల్యే

విజేయుడు - ఆలంపూర్ ఎమ్మెల్యే

పాడి కౌశిక్ రెడ్డి - హుజురాబాద్ ఎమ్మెల్యే

పల్లా రాజేశ్వర్ రెడ్డి - జనగాం ఎమ్మెల్యే

Advertisement

Next Story