తార్నాకలో కావ్య కిషన్ రెడ్డి ప్రచారం

by Disha Web Desk 11 |
తార్నాకలో కావ్య కిషన్ రెడ్డి ప్రచారం
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆశీర్వదించి బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ఆయన సతీమణి కావ్య కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం తార్నాక డివిజన్ పరిధిలో మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంట్ల వాసులను, కాలనీవాసులను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి పార్టీని మూడవసారి అధికారంలోకి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి అనూష, తార్నాక డివిజన్త అధ్యక్షురాలు సత్యవతి, తార్నాక అపార్ట్మెంట్ వాసులు శ్రీనివాస్, శశాంత్, రాజశేఖర్, రామ్మోహన్ రావు, కృష్ణ రెడ్డి, దళిత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed