- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గెలిపిస్తే ఇంటి మనిషిలా పనిచేస్తా
దిశ, చైతన్యపురి : తనను ఎంపీగా గెలిపిస్తే మీ సొంత ఇంటి మనిషిలా పనిచేస్తానని మల్కాజిగిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. బస్తీలో తాగు నీరు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండాలన్నా పేద కుటుంబాలకు ఇళ్లు రావాలన్నా అది కేవలం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. గురువారం కొత్తపేట డివిజన్ లోని శివగంగ కాలనీ శివాలయం నుండి శివమ్మ నగర్, అంబేద్కర్ నగర్, భరత్ నగర్ ఫేస్ వన్, ఫేస్ టు, రాజీవ్ గాంధీ నగర్ ఫేస్ వన్, ఫేస్ టు, స్థానిక కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ రెండవ నెంబర్ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని నరేంద్ర మోడీని బలపర్చాలని కోరారు.
బీఆర్ఎస్ పని తెలంగాణలో అయిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తే ప్రజలందరూ కలిసి ప్రశ్నించాలన్నారు. చదువుకునే ఆడ బిడ్డలకు ఉచితంగా స్కూటీలు అందిస్తామని చెప్పి, ప్రతి మహిళలకు రూ. 2500 ఖాతాలో జమ చేస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. ప్రతి ఆటో డ్రైవర్కు 12 వేలు ఇస్తానని, నేడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాలని సూచించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్, గీత రెడ్డి, అంబాలా మల్లేష్, స్వామి, సుందర్ నారాయణ, అశ్విన్ సింగ్, కొత్త తిరుమల, మోతీలాల్ నాయక్, రవి నాయక్, శివ చారి, జంగయ్య, మల్లేష్ యాదవ్, మహేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.