హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ : రాజస్థాన్ సీఎం భజన్ లాల్ సింగ్

by Disha Web Desk 11 |
హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ :  రాజస్థాన్ సీఎం భజన్ లాల్ సింగ్
X

దిశ, తొర్రూరు:- ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆయన చెప్పారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి..వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తరపున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్ల పాటు పాలించినా దేశానికి చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో టెర్రరిజం, నక్సలిజం పూర్తిగా తగ్గిపోయాయన్నారు.

తెలంగాణలో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని, మూడోసారి కూడా మోడీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అన్ని రంగాలను అభివృద్ధి చేశామని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తోందని, ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.తెలంగాణ, వరంగల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు.

సుస్థిర పాలన అందించే సత్తా బీజేపీకే ఉందన్నారు. వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పూసల శ్రీమాన్ అసెంబ్లీ కన్వీనర్, మర్నెని ధర్మారావు (ఎక్స్ ఎమ్మెల్యే,నియోజకవర్గ ఇన్చార్జి),ఆరుట్ల దశమత్ రెడీ,(జనగామ అధ్యక్షుడు)వైవి రావు(మానుకోట అధ్యక్షుడు)టి, రాజేశ్వర రావు(ఎక్స్ ఎమ్మెల్యే)వన్నల శ్రీ రాములు(ఎక్స్ ఎమ్మెల్యే), లేగ రాంమోహన్ రెడీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,గంట రవికుమార్(వరంగల్ జిల్లా అధ్యక్షులు), మురళీధర్ రావు,సోడా రమేష్, తల్లపెల్లి కుమార్,కొలువుల శంకర్, బీజేపీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed