Breaking News :హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు

by M.Rajitha |   ( Updated:2024-10-13 17:49:13  )
Breaking News :హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈనెల 10న బంజారాహిల్స్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సమయం దాటిన తర్వాత కూడా డీజే వాడినందుకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి శబ్ధ కాలుష్యం చేస్తూ డీజే పెట్టినందుకు, బతుకమ్మ వేడుకల నిర్వాహకులు, డిజే నిర్వాహకులతోపాటు మేయర్‌పై చర్యలకు సిద్దమయ్యారు. బతుకమ్మ వేడుకలకు అనుమతించిన దానికంటే అధిక డెసిబుల్ సంగీతాన్ని పెట్టారని పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మేయర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed