HYDERABAD: చికెన్, మటన్ మసాలాలు తినేవారికి బిగ్ షాక్..!

by Kavitha |
HYDERABAD: చికెన్, మటన్ మసాలాలు తినేవారికి బిగ్ షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో బయట ఆహారం తినాలంటేనే భయమేస్తుంది. ఆహారాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి తినే ఆహారాన్ని కల్తీ మయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ఐటెమ్స్‌ను కల్తీ చేసి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యాపారస్తులను శంషాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. CI నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పహాడి షరీఫ్‌కు చెందిన చంద్ర ప్రకాశ్, పెద్దషాపూర్ వాసి ఉజ్మా రాములు సంయుక్తంగా నిత్యావసర ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. అయితే కల్తీ తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేసి 3.13 క్వింటాళ్ల కారం పొడి, 1.10 క్వింటాళ్ల ధనియాల పొడి చికెన్, మటన్ మసాలను సీజ్ చేశారు.

Advertisement

Next Story