HYD : మెహదీపట్నంలో సెల్‌ఫోన్ చోరీకి వచ్చి దొంగ మృతి

by Rajesh |
HYD : మెహదీపట్నంలో సెల్‌ఫోన్ చోరీకి వచ్చి దొంగ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెహదీపట్నంలో చోరీకి యత్నించిన దొంగపై దాడి ఘటనలో సదరు వ్యక్తి మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనంలో దొంగ చోరీకి యత్నించాడు. భవనంలో నిద్రిస్తున్న కార్మికుల సెల్ ఫోన్ చోరీకి దొంగ యత్నించాడు. అయితే దొంగను పట్టుకునేందుకు యత్నించిన కార్మికులపై బ్లేడుతో దాడికి యత్నించాడు. ఆత్మరక్షణ కోసం కార్మికులు కర్రతో కొట్టడంతో దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. కార్మికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. దొంగను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story