HYD : నిజాంపేట్‌లో పట్టపగలే దొంగల బీభత్సం

by Rajesh |
HYD : నిజాంపేట్‌లో పట్టపగలే దొంగల బీభత్సం
X

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్‌లో పట్ట పగలే దొంగతనం జరిగి నగదు, నగలు ఎత్తుకెళ్లిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉండే షేక్ అబ్దుల్ గఫార్ వృత్తి రీత్యా టైలర్. జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటికీ శుక్రవారం తాళం వేసి టైలరింగ్ పనుల నిమిత్తం షాప్‌కీ వెళ్ళాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు సైతం లేకపోవడంతో దొంగలు ఇంట్లోకీ చొరబడి ఇంటికీ వేసిన తాళానికి మరో డుబ్లీకేట్‌ ‘కీ’తో తాళం తీసి తాపీగా దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న రూ. 5 లక్షలు నగదు, 10 తులాలు బంగారం దోచుకెళ్లారు.

రాత్రికీ టైలరింగ్ విధులు ముగించుకొని ఇంటికీ వచ్చిన అబ్దుల్ గఫార్ బెడ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా బీరువా ఓపెన్ చేసి ఉంది. అనుమానంతో బీరువాను పరిశీలించగా బీరువాలో ఇళ్లు కొనేందుకు దాచిన రూ. 5 లక్షలు నగదుతో పాటు 10 తులాల బంగారం కనిపించలేదు. దొంగతనం జరిగినట్లుగా గ్రహించి బాచుపల్లి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగిన ఇంటిని బాచుపల్లి క్రైమ్ పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటన పట్ట పగలే జరగడం, తాళం కూడా వేసి ఉండడం చూస్తుంటే తెలిసిన వారి పనిగానే స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed