HYD : కొత్తపేటలో తల్లీకుమారుడు సూసైడ్

by Rajesh |
HYD : కొత్తపేటలో తల్లీకుమారుడు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కొత్తపేటలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపేటలో తల్లీ కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో రాత్రి ఉరేసుకుని తల్లి పద్మ ఆత్మహత్య చేసుకోగా.. తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు వంశీ సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులను ఒంగోలు వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story