- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
HYD : యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ల హత్యాచార యత్నం
![HYD : యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ల హత్యాచార యత్నం HYD : యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ల హత్యాచార యత్నం](https://www.dishadaily.com/h-upload/2024/06/20/344635-rape.webp)
దిశ, శేరిలింగంపల్లి : జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు హత్యాచారానికి యత్నించిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్లో ట్రైనీగా జాయిన్ అయింది.
అయితే అదే రియల్ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ విజిట్ కోసం అంటూ ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి ఆమెపై హత్యాచారానికి యత్నించారు. అయితే వారి నుండి తప్పించుకున్న ఆ యువతి గతరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేసి, అక్కడి నుండి మియాపూర్కు పంపించారు. హత్యాచార ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.