టీమ్ ఇండియాకు మహారాష్ట్ర సర్కారు భారీ నజరానా

by Harish |
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర సర్కారు భారీ నజరానా
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ చాంపియన్ టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భారీ రివార్డు ప్రకటించారు. రూ. 11 కోట్ల నగదు బహుమతిని అందజేశారు. ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె ముంబైకి చెందిన వారు. వారిని సీఎం ఏక్‌నాథ్ షిండే శుక్రవారం ప్రత్యేకంగా సన్మానించారు. విధాన్ భవన్‌లోని సెంట్రల్ హాల్‌లో సన్మాన కార్యక్రమం జరిగింది. ప్లేయర్లతోపాటు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, సపోర్టింగ్ స్టాఫ్‌లోని అరుణ్ కనాడేలను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Next Story

Most Viewed