నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి గుడ్ న్యూస్.. ఏడాదికి ముందే స్టైఫండ్‌ రిలీజ్

by Satheesh |
నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి గుడ్ న్యూస్.. ఏడాదికి ముందే స్టైఫండ్‌ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు సర్కార్ నిధులు విడుదల చేసింది. 2024-25కి సంబంధించిన రూ.406 కోట్ల స్టైఫండ్ నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, టీచింగ్ మెడికల్ స్టాఫ్, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి భారీ ఊరట దక్కింది. ఏడాదికి ముందే ప్రభుత్వం స్టైఫండ్ నిధులు విడుదల చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story