- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రైతులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త..
దిశ, వెజ్డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు బెనిఫిట్ కలిగేలా కొత్త స్కీమ్స్ను అమలులోకి తీసుకురావడంతో పాటు ఆ స్కీమ్స్తో రైతులకు వేల రూపాయలు అందేలా చేస్తోంది.
కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా... ఈ స్కీమ్కు అర్హులైన రైతుల ఖాతాల్లో 6000 రూపాయలు జమవుతోంది. ప్రస్తుతం ఈ 6 వేల రూపాయలను రెట్టింపుగా 12000 రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కేంద్రం ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తే రైతులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి సంవత్సరం పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతుండగా రైతులకు మేలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గమనార్హం. కోట్ల సంఖ్యలో రైతులు పీఎం కిసాన్ స్కీమ్ మొత్తాన్ని పెంచాలని భావిస్తున్నారు.
మరోవైపు ఎరువులపై సబ్సిడీని పెంచాలని కొంతమంది రైతుల కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ స్కీమ్ నగదు 13 విడతల్లో జమ కాగా రైతులకు 26000 రూపాయల బెనిఫిట్ కలిగింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం 14వ విడత నగదును సైతం రైతులకు ఇవ్వనుందని తెలుస్తోంది. గతంలోనే పీఎం కిసాన్ నగదు మొత్తాన్ని పెంచుతున్నట్టు వార్తలు వచ్చినా అది నిజం కాలేదు. ఈ స్కీమ్ అమలు అయితే 8 కోట్ల కంటే ఎక్కువమంది రైతులకు లాభం కలుగుతుంది. కొంతమంది రైతులు వివరాలను నమోదు చేయకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. మరోవైపు అర్హత లేని వాళ్లను ఈ స్కీమ్ నుంచి కేంద్రం తొలగిస్తుందని సమాచారం.