బీజేపీపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్

by Satheesh |
బీజేపీపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు యూపీఏ హయాంలోనే పర్మిషన్లు వచ్చాయన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్​చేసి ఉంటే, గడిచిన పదేళ్లలో దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. కానీ కిషన్ రెడ్డి, దత్తాత్రేయ ఐటీఐఆర్‌ను ఏర్పాటును కిల్ చేశారన్నారు. రద్దు చేసిన ఐటీఐఆర్‌ను తెప్పించాల్సిన బాధ్యత బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై స్పష్టంగా ఉన్నదన్నారు.

ఐటీఐఆర్ రద్దు చేస్తే, గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కనీసం నోరుమెదప లేదన్నారు. సెంట్రల్‌లోని బీజేపీ మంత్రులు కూడా పట్టించుకోలేదన్నారు. గుళ్లు, గోపురాలు అంటూ బీజేపీ దొంగ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. దేవుళ్ల మీద ఒట్లు వంటివి ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. రద్దు చేసిన ఐటీఐఆర్‌ను వెంటనే తీసుకురావాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed