Ponnam: గురుకుల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్

by Prasad Jukanti |   ( Updated:2024-10-07 12:33:59.0  )
Ponnam: గురుకుల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈఏపీసెట్ (ఎంసెట్) , నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం మోడల్ స్కూల్స్ లో అమలవుతున్నట్లుగానే బీసీ గురుకులాల్లో కూడా పదవ తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సోమవారం బంజారాహిల్స్ లోని కొమురంభీమ్ భవన్ లో జరిగిన బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం కలిసి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గురుకులాల్లో ఇంటర్ లో కంప్యూటర్ తో పాటు అన్ని కోర్సులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకులాల్లో చదువుతున్న 8,9,10 తరగతి విద్యార్థులకు రెడ్ క్రాస్, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ లలో ప్రతి విద్యార్థి రెండిటిలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని ఈ నెల 15వ తేదీ నుంచి 31 లోపు ఈ గురుకులాల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దసరా లోపు రెంటెడ్ గురుకుల భవనాలకు 50 శాతం అద్దె చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. యజమానితో మాట్లాడి భవనాల్లో మౌలిక వసతులు కల్పించేలా వారితో మాట్లాడాలన్నారు.బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. హాస్టల్స్ వార్డెన్ ల ప్రమోషన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీబీసీడీవోస్, ఏడీబీసీడీవోస్ పోస్టులు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed