DK Aruna: కలెక్షన్ల కోసమే తెరపైకి ‘హైడ్రా’‌ను తీసుకొచ్చిండ్రు: ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-30 03:59:13.0  )
DK Aruna: కలెక్షన్ల కోసమే తెరపైకి ‘హైడ్రా’‌ను తీసుకొచ్చిండ్రు: ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా’.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతే లక్ష్యంగా ఆ సంస్థ పక్కా కార్యాచరణతో మందుకెళ్తోంది. సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, బిగ్‌షాట్స్ అనే తేడా లేకుండా అందరికీ సమన్యాయం పాటిస్తూ.. అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. అయితే, పలువురు నాయకులు హైడ్రా‌కు ఫుల్ సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, మహబూబ్‌నగర్‌లో నిలుపేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు.

మహారాష్ట్ర, హర్యాన, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ రాష్టాల్లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. ఆ రాష్ట్రాలకు ఫండింగ్ చేసేందుకు కలెక్షన్ల కోసమే సీఎం రేవంత్ ‘హైడ్రా’ను తెరపైకి తీసుకొచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ విపక్షాలు హామీలపై ప్రశ్నిస్తాయోనని.. అవి అమలు చేయలేకే హైడ్రా పేరుతో రేవంత్ హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకవేళ ఆక్రమణలే జరిగితే ఓ పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో గత ప్రభుత్వాలు నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తే.. కాంగ్రెస్ సర్కార్ కూల్చివేయడం ఎంత సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed