ఈనెల 6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-10-04 08:36:49.0  )
ఈనెల 6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈనెల 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith sha)ను కలిసి, వరద నష్టం వివరాలను సమర్పించి, కేంద్రం ప్రకటించిన అతితక్కువ వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. వరద నష్టాన్ని అంచనావేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు, కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు, వరదల వలన భారీ నష్టాలు సంభవించాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ వరద సాయం కింద కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రూ. 1500 కోట్లు తక్షణ సాయం ప్రకటించారు. కానీ వాస్తవంగా తెలంగాణకు అతి తక్కువగా రూ. 421 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. తెలంగాణలో వరద నష్టం రూ.10 వేల కోట్లకు పైగా లెక్క తేలగా.. కేంద్రం మాత్రం అరకొర సహాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి మరోసారి వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారు.

Next Story