- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన ఆ ఐదుగురికి CM రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్
దిశ, వెబ్డెస్క్: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక రిక్వెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. ఎన్డీయే సర్కారులో టీడీపీ కీలకంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి సైతం 4 ఎంపీ స్థానాలు ఉండగా అవి ఏకంగా డబుల్ అయి 8 స్థానాలు అయ్యాయి. దీంతో ఈ దఫాలో తెలంగాణ, ఏపీకి వచ్చే నిధుల్లో ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తుందనే అంశంలో ఆసక్తి నెలకొంది.