రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ.. వరంగల్ సభకు రావాలని ఆహ్వానం

by Mahesh |
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ.. వరంగల్ సభకు రావాలని ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీ లో భాగంగా ఈ నెల 18 రూ. లక్ష రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అలాగే రెండో విడత, మూడో విడతలో మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న సందర్భంగా వరంగల్ లో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని.. ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు.. సోమవారం సాయంత్రం రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రైతు రుణమాఫీ, వరంగల్ సభపై రాహుల్‌తో చర్చించారు. అనంతరం వరంగల్‌ సభకు రావాలని రాహుల్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే ఈ సభను ఎప్పుడు నిర్వాహిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story