- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
లారీ ఢీకొని 6వ తరగతి విద్యార్థిని దుర్మరణం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. జాన్సన్ గ్రామర్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి అనే విద్యార్థిని స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. అదే మార్గంలో వేగంగా వచ్చిన లారీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద వెనుక నుండి విద్యార్థినిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుండి పారిపోయాడు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని లారీని సీజ్ చేశారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నామని మీడియాకు తెలిపారు.
Next Story