BREAKING : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి

by Rajesh |
BREAKING : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు శుక్రవారం మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఖైదీగా సయ్యద్ మక్బూల్ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో మక్బూల్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో మక్బూల్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 6 నెలల క్రితం మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది. ట్రాన్సిట్ వారెంట్‌పై ఢిల్లీ నుంచి మక్బూల్‌ను అధికారులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.



Next Story