BREAKING: కామారెడ్డి జిల్లా ఘన్‌పూర్‌ వద్ద పోలీసుల తనిఖీలు.. రూ.49.08 లక్షల నగదు సీజ్

by Disha Web Desk 1 |
BREAKING: కామారెడ్డి జిల్లా ఘన్‌పూర్‌ వద్ద పోలీసుల తనిఖీలు.. రూ.49.08 లక్షల నగదు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు రోడ్లపై పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కామారెడ్డి జిల్లా పరిధిలోని ఘన్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేపడుతుండగా.. కారులో తరలిస్తున్న రూ.49.08 లక్షలను గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో క్యాష్‌ను సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించారు.



Next Story

Most Viewed