దోస్త్ థ‌ర్డ్ ఫేజ్ సీట్లు కేటాయింపు.. సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 25 చివ‌రి తేదీ

by Vinod kumar |
దోస్త్ థ‌ర్డ్ ఫేజ్ సీట్లు కేటాయింపు.. సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 25 చివ‌రి తేదీ
X

దిశ ,తెలంగాణ బ్యూరో : యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్) ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. గురువారం ఈ మేరకు ఉన్నత విద్యామండ‌లి దోస్త్ థ‌ర్డ్ ఫేజ్ సీట్లను కేటాయించింది. థ‌ర్డ్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును నిర్ధారించుకోవాలని సూచించింది. ఫ‌స్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థ‌ర్డ్ ఫేజ్‌లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా త‌మ సీట్లను ధృవీక‌రించుకున్న విద్యార్థులు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వ‌ర‌కు త‌మ త‌మ కాలేజీల్లో సీసీఓటీపీని స‌మ‌ర్పించి సీట్ల‌ను ధృవీక‌రించుకోవాల‌ని అధికారులు సూచించారు.

మొదటి ఫేజ్‌లో 45,690 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా సెకండ్ ఫేజ్ లో 33815 మంది రిపోర్ట్ చేశారు. ఇక థ‌ర్డ్ ఫేజ్‌లో 72,949 మంది విద్యార్థుల సీట్లు పొందారు. ఇందులో ఆర్ట్స్ గ్రూపులో 10,939 మంది, కామ‌ర్స్ గ్రూపులో 32,209, లైఫ్ సైన్సెస్ గ్రూపులో 16,859, ఫిజిక‌ల్ సైన్స్ గ్రూపులో 12,620, డీ ఫార్మసీలో 235 మంది సీట్లు పొందారని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed