టీజీపీఎస్సీ ఎదుట బీజేవైఎం ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత

by Rajesh |
టీజీపీఎస్సీ ఎదుట బీజేవైఎం ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: టీజీపీఎస్సి ఎదుట బీజేవైఎం నేతలు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు - బీజేవైఎం నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు దిగిన బీజేవైఎం నేతలను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలన్నారు.25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలన్నారు. జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

Advertisement

Next Story