Announcement of Awards: పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డుకు ముగ్గురు ఎంపిక

by Shiva |
Announcement of Awards: పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డుకు ముగ్గురు ఎంపిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డుకు ప్రముఖ సినీగేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, బలగం ఫేం కొమురమ్మ, మొగిలయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు జ్యూరీ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈనెల 13న రవీంద్ర భారతిలో అవార్డులు ప్రధానం చేయనున్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్యగౌడ్ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రకటించి రచయితలకు, కళాకారులకు అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా అవార్డులు ఎంపిక కోసం సోమవారం జ్యూరి కమిటీ హైదరాబాద్‌లో సమావేశమైంది. కన్వీనర్ పొన్నం రవిచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు సీనియర్ పాత్రికేయులు, మాజీ కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడ‌భూషి శ్రీధర్, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దిలీప్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రచయిత్రి ఐనంపూడి శ్రీ లక్ష్మీ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కన్వీనర్ రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పొన్నం సత్తయ్యగౌడ్ మెమోరియల్ అవార్డు ను అందజేస్తున్నట్లే, ఈసారి కూడా కమిటీ పలువురు రచయితలు, కళాకారుల పేర్లను పరిశీలించిందన్నారు. ఇందులో రచయితల విభాగంలో ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారుల విభాగంలో బలగం ఫేం కొమురమ్మ మొగిలయ్యలను అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేశామన్నారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొకరికి రూ.51 వేల రూపాయల నగదు, మోమెంటతో సత్కరించనున్నట్లుగా కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర తెలిపారు. అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా శాసన‌సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విశిష్ట అతిధులుగా ఎక్సైజ్ అండ్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed