నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by karthikeya |
నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: వేలాదిమంది ప్రజలు విరోచిత పోరాటం ఫలితంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ (Telangna)కు విమోచన లభించిన రోజు నేడని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి (Kishan Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం దక్కిందని, నిజాం రాజకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (Sardar VallabhBhai Patel) పాత్ర సాహసోపేతమైనదని వ్యాఖ్యానించారు. ఆ గొప్ప విజయానికి ప్రతీకగానే మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

‘‘కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీ (MIM Party)కి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి’’ అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శోభా యాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) జన్మదిన వేడుకలు.. నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం చాలా సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed