తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుల నియామకం

by Satheesh |
తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి (రిటైర్డ్), తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులుగా ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె (అడ్వకేట్, జ్యూడీషియల్ మెంబర్), అధికారి చిత్రా రామచంద్రన్ (టెక్నికల్/అడ్మినిస్ట్రేటివ్ మెంబర్)గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం జి.ఓ.నెం.67 ద్వారా జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి (రిటైర్డు)ను తెలంగాణ రియల్ ఎస్టేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా గాను, జి.ఓ.నెం. 68 ద్వారా సభ్యులుగా అడ్వకేట్, జ్యూడీషియల్ మెంబర్ ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రిటైర్డు ఐఎఎస్ అధికారి చిత్రా రామచంద్రన్‌లనూ నియమిస్తూ ఈ నెల 7వ తేదిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రెరా అథారిటీ చైర్మన్ డా. ఎన్ సత్యనారాయణ, సభ్యులు కె.శ్రీనివాసరావు, జె. లక్ష్మీనారాయణ, అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్పర్సన్, సభ్యులతోపాటు రెరా అథారిటీ ఛైర్మన్, సభ్యులు సమావేశమై చర్చించారు. ఈ కార్యక్రమంలో రెరా అడ్జ్ డికేటింగ్ ఆఫీసర్ లతీఫ్-ఉర్-రెహమాన్, రెరా జాయింట్ డైరెక్టర్ డా. శ్రీనివాసరెడ్డి, పరిపాలనాధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story