తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం

by Satheesh |
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎయిడ్స్ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా మరో 16 యంటీరిబ్రోవైరల్ థెరఫీ(ఏ ఆర్టీ ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకొకటి చొప్పున అందుబాటులో ఉండేలా అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 కేంద్రాలుండగా, కొత్త సెంటర్లూ ఏర్పడితే, జిల్లాకు ఒకటి చొప్పున అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఆయా ఏఆర్టీ సెంటర్లను కేవలం మెడికల్ కాలేజీల్లో మాత్రమే ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు అనుగుణంగా హెల్త్ సెక్రటరీ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఒక్కో సెంటర్‌లో డాక్టర్‌తో పాటు మరో ఐదుగురు స్టాఫ్​ఉండనున్నారు.

Advertisement

Next Story