- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
గెలిచి చూపిద్దాం.. విమర్శకుల నోళ్లు మూపిద్దాం : శ్రీధర్ బాబు
దిశ, తెలంగాణ బ్యూరో: సమిష్టి కృషితో కాంగ్రెస్పార్టీని అధికారంలోకి తీసుకురావలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్బాబు పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ యూత్కాంగ్రెస్కార్యవర్గ సమావేశానికి ఆయన గురువారం హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ విమర్శకుల నోళ్లు మూపించే రోజు దగ్గర్లోనే ఉన్నదన్నారు. కలసి పనిచేస్తే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు.
ప్రజల్లో ఉండే వారికే పదవులు వస్తాయన్నారు. యూత్ కాంగ్రెస్లో మహిళలకు పెద్ద పీట వేస్తామన్నారు. గ్రామ స్థాయిలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా బలోపేతంపై కార్యచరణ తయారు చేయాలని సూచించారు. తెలంగాణ ఎలక్షన్లో యూత్ కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామ స్ధాయికి తీసుకెళ్లే కార్యచరణను రూపొందించాలన్నారు. యూత్ తలచుకుంటే కాంగ్రెస్గెలుపు నల్లేరు మీద నడకే అని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్సిద్ధంతాన్ని వ్యాప్తి చెందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.