- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
హైడ్రాకు మేం వ్యతిరేకం కాదు
దిశ, భైంసా : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం బైంసాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రాలో రాజకీయ నాయకులను, ధనవంతులను, వదిలి పెడుతూ పేదలకు అన్యాయం చేస్తే సహించమన్నారు. చెరువుల ఆక్రమణల్లో తప్పు చేసిన వారందరికీ శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదేవిధంగా పేదలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.
హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామన్నారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని నిన్న బీజేఎల్పీ సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. పేదలకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. అందరికీ రేషన్ కార్డులు ఇస్తే కేంద్రం సరుకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా పది సంవత్సరాలుగా వారి కడుపు కొట్టిందన్నారు. అదేవిధంగా గణేష్ నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.