- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
చెరువులో పడి వ్యక్తి మృతి
by Jakkula Mamatha |
X
దిశ, చింతలమానేపల్లి: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చింతలమానేపల్లి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో పోచమ్మ చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి కొంపరి కిరణ్ (28 ) అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో మతిస్థిమితం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. సోమవారం మండల కేంద్రంలోని పోచమ్మ చెరువులో పడి మృతి ఉండటంతో స్థానికులు గమనించి పోలీస్ వారికి సమాచారం అందజేయడంతో శవాన్ని బయటకు తీసి వైద్యుల సాయంతో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మృతుని తండ్రి కొంపరి సదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
Advertisement
Next Story