నడుస్తున్న బోట్ లో నుంచి నీటిలో దూకిన మహిళ

by Y. Venkata Narasimha Reddy |
నడుస్తున్న బోట్ లో నుంచి నీటిలో దూకిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ మానేరు డ్యాంలో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం నీటిలోకి దూకింది. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ లో వెనుక వైపు వెళ్లిన మహిళ ఒక్కసారిగా నీటిలో దూకింది. అప్రమత్తమైన బోట్ డ్రైవర్ మహిళను రక్షించేందుకు లైఫ్ జాకెట్ విసిరారు. మహిళను నీటిలో నుంచి రక్షించి పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎందుకు నీటిలో దూకిందన్నదానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా డ్యాంలో టూరిస్ట్ బోట్లు నడిపిస్తున్నారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో డ్యాం అందాలను తిలకిస్తు బోటింగ్ చేసేందుకు వస్తున్నారు. ఆ ఘటనతో పర్యాటకుల భద్రతపై సిబ్బంది మరింత దృష్టి సారించారు.

Next Story

Most Viewed