- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
WTC Final 2023: మూడోరోజు ఆట.. ఆరో వికెట్ కోల్పోయిన భారత్
దిశ, వెబ్డెస్క్: WTC Final 2023 మూడోరోజు ఆటలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లోనే టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఐదు పరుగులు చేసిన శ్రీకర్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో 152 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. ప్రస్తుతం అజింక్య రహానే (71 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు), శార్దూల్ ఠాగూర్ (8) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 6 వికెట్లకు 173 రన్స్ చేసింది. మరో 318 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ తొలి ఇన్నింగ్స్లో ఎంత వరకు పోరాడుతుందనే దానిపైనే టెస్టు ఫలితం ఆధారపడి ఉంది.