WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా అట్టర్ ఫ్లాఫ్..

by Vinod kumar |
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా అట్టర్ ఫ్లాఫ్..
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత బ్యాటర్లు చేతులత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆట ముగించింది. ప్రస్తుతం క్రీజులో రహానే (29), భరత్ (5) ఉన్నారు. భారత బ్యాటర్లలో.. రోహిత్ (15), గిల్ (13), పుజారా (14), కోహ్లీ (14), జడేజా (48) తక్కువ పరుగులకే ఔటవ్వడంతో టీమ్ ఇండియా కష్టాల్లోపడింది. భారత్ ఇంకా 318 పరుగుల వెనకబడి ఉంది. 118 రన్స్ చేస్తేనే ఫాలో ఆన్ గండం నుంచి బయటపడనుంది.

Advertisement

Next Story