WTC Final 2023: రెండో రోజు 'కంగారు' పెట్టించిన భారత బౌలర్లు..

by Vinod kumar |
WTC Final 2023: రెండో రోజు కంగారు పెట్టించిన భారత బౌలర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్‌ అయింది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ మరో 182 పరుగులు చేసి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్స్‌లో.. ట్రెవిస్‌ హెడ్‌ (163), స్మిత్‌ (121), అలెక్స్‌ కేరీ (48), డేవిడ్‌ వార్నర్‌ (43) పరుగులుతో రాణించారు. టీమిండియా బౌలర్లో సిరాజ్‌ 4 వికెట్లు తీయగా.. షమీ, శార్దూల్‌లు 2, జడేజా ఒక వికెట్‌ తీశాడు.

Advertisement

Next Story