WTC Final 2023: లంచ్‌ విరామం.. టీమ్ ఇండియాను నిలబెట్టిన రహానే, శార్దూల్‌

by Vinod kumar |
WTC Final 2023: లంచ్‌ విరామం.. టీమ్ ఇండియాను నిలబెట్టిన రహానే, శార్దూల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: లంచ్‌ విరామ సమయానికి టీమిండియా 60 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అజింక్యా రహానే 89 పరుగులు బ్యాటింగ్‌కు తోడుగా. శార్ధూల్‌ ఠాకూర్‌ 36 బ్యాటింగ్‌ క్రీజులో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించడంతో టీమిండియా కాస్త కోలుకుంది. అంతకముందు మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు షాక్‌ తగిలింది. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో కేఎస్‌ భరత్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శార్దూల్‌.. రహానేతో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story