సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు తెలుగమ్మాయి ఎంపిక

by Harish |
సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు తెలుగమ్మాయి ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : మరో తెలుగమ్మాయి భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన మీడియం పేసర్ షబ్నమ్ షకీల్‌ తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో మూడు ఫార్మాట్ల జట్లకు సెలెక్టర్లు ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం వెల్లడించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న హర్మన్‌ప్రీత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది. ఆదివారం ఆఖరిదైన మూడో మ్యాచ్ జరగనుంది.

కాగా, షబ్నమ్ షకీల్ ఈ ఏడాది మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలు. ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆమె ఒక్క వికెట్ తీసింది. అలాగే, ఉమెన్స్ ప్రీమియల్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున నాలుగు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టింది. హైదరాబాద్‌కు చెందిన అరుంధతి రెడ్డి సౌతాఫ్రికాతో రెండో వన్డేలో వన్డే అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మరి, షబ్నమ్ షకీల్ ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తుందో లేదో చూడాలి.

Advertisement

Next Story