నష్టాల బాటలో మార్కెట్లు!

by Harish |
నష్టాల బాటలో మార్కెట్లు!
X

మార్చి త్రైమాసిక లక్ష్యాలను చేరుకోలేని దిగ్గజ ఫోన్ సంస్థ యాపిల్ అంచనాల కారణంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇక కరోనా భయాలు, ఏజీఆర్ చెల్లింపుల కారణంగా టెలికాం సూచీలు దిగజారినట్టు నిపుణులు భావిస్తున్నారు. దీంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు నష్టాల్లో క్లోజయ్యాయి. చివరి గంటపై మదుపర్లు అంచనాలను పెంచుకున్నప్పటికీ మార్కెట్ నష్టాలతోనే ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161.31 పాయింట్ల నష్టంతో 40,894 వద్ద క్లోజయింది. నిఫ్టీ 53.30 పాయింట్లు నష్టపోయి 11,992 వద్ద ముగిసింది. ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగించగా, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఎయిర్‌టెల్, హిందాల్‌కో షేర్లు నష్టాలతో ముగిశాయి.

Advertisement

Next Story

Most Viewed