రిజిస్ట్రేషన్ ​ఫీజులు అదనంగా చెల్లించాల్సిందే..

by Shyam |
Dharani
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ​ఫీజులు గురువారం అమల్లోకి వచ్చాయి. అయితే అంతకు ముందే స్లాట్​బుక్ ​చేసుకున్న వారు పాత రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్​ ఫీజులు చెల్లించారు. వారంతా పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు రుసుమును చెల్లించేందుకు ధరణి పోర్టల్‌లో కొత్త మాడ్యూల్‌ను రూపొందించింది. ఇప్పటికే స్లాట్లు బుక్ ​చేసుకున్న వారు మిగతా సొమ్మును ఈ మాడ్యూల్​ ద్వారా చెల్లించాల్సి ఉంది.

ధరలు పెరుగుతున్నాయంటూ ముందుస్తుగా స్లాట్లు బుక్​ చేసుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. పెరిగిన ఫీజుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం వదల్లేదు. గురువారం నుంచి ఎవరు క్రయ విక్రయాలు చేసినా కొత్త ధరల ప్రకారమేనని స్పష్టం చేసింది.



Next Story