విద్యుత్ తీగలు.. వారి పాలిట యమపాశాలు..

by Shyam |
విద్యుత్ తీగలు.. వారి పాలిట యమపాశాలు..
X

దిశ, మేడ్చల్ : మండలంలో గల విద్యుత్ స్తంభాల తీగలు ప్రజల పాలిట యమపాశాలుగా మారాయి. పొలం పనుల కోసం వెళ్తే విద్యుత్ స్తంభం ఎప్పుడు పడిపోతోందో.. ఏ తీగలు తగిలి మృత్యువాత పడుతారో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని బండమాదారం గ్రామంలోని పెద్ద చెరువు వద్ద విద్యుత్ స్తంభం నేలకొరిగి పడిపోవడానికి సిద్ధంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలు ఉన్నాయని రైతులు తమ పొలాలకు వెళ్లే సమయంలో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

విద్యుత్ చార్జీల వసూళ్ల పై అధికారులకు ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల పై లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు . విషయంపై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed