జపాన్ చేరిన ఒలింపిక్ జ్యోతి

by vinod kumar |   ( Updated:2020-03-21 04:25:27.0  )
జపాన్ చేరిన ఒలింపిక్ జ్యోతి
X

ఒలింపిక్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఒలింపిక్ టార్చ్ (జ్యోతి). ఈసారి ఒలింపిక్స్ జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ఒలంపిక్ టార్చ్ గ్రీస్ నుంచి శుక్రవారం జపాన్ చేరుకుంది. ‘హోప్ లైట్స్ అవర్ వే’ అని రాసున్న ప్రతేక విమానం ఒలింపిక్ జ్యోతితో టోక్యోలోని మిలటరీ బేస్ ఎయిర్‌పోర్టులో దిగింది. కరోనా భయంతో ఈ వేడుకకు ప్రజలెవరినీ అనుమతించలేదు. జపాన్‌లో ప్రముఖ క్రీడాకారులైన సౌరీ యోషిడా, తదా దాహిరో నోమురా ఈ జ్యోతిని అందుకున్నారు. అనంతరం వాళ్లు ఆ జ్యోతిని ఒలింపిక్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మెరీకి అప్పగించారు.

Tags : Olympic Torch, Japan, Tokyo, Special Airplane, Greece

Advertisement

Next Story

Most Viewed