దీదీ నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు.. లేకపోతేనా..?

by Javid Pasha |
దీదీ నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు.. లేకపోతేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య మినీ వార్ నడుస్తోంది. బీజేపీని ఎలాగైనా పవర్ నుంచి దించాలని దేశంలోని విపక్ష పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఒకటి. టీఎంసీ, బీజేపీ మధ్య వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. దర్యాప్తు సంస్థలతో తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీపై టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఎంసీ పార్టీ నేతలు బీజేపీ నేతల చేతులు నలగొట్టగలరని ఆయన అన్నారు. 'దీదీ నన్ను సైలెంట్‌గా ఉండమన్నారు. అందుకే మేము ప్రశాంత వాతావరణాన్ని ఉంచుతున్నాం. కానీ ఒకవేళ బీజేపీ నేతలెవరైనా మా నేతల చేతులు విరగొడతామని బెదిరిస్తే మా నేతలు వాళ్ల చేతులు నలగొడతారు' అని ఆయన అన్నారు. బీజేపీపై కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Also Read : ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్.. ఇకపై మరింత కాస్ట్లీగా KCR పర్యటన


Advertisement

Next Story

Most Viewed